Posted in

ఉజ్వల లబ్ధిదారులకు మరో షాక్.. ఇక ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ

Ujjwala gas
Ujjwala gas

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎల్‌పీజీ సబ్సిడీని మరింత తగ్గించింది. ఇప్పటి వరకు ఏడాదికి 9 రీఫిల్లుల వరకు అందుతున్న రూ.300 సబ్సిడీని ఇకపై కేవలం 4 సిలిండర్లకే పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో ఉజ్వల పథకం కింద ఉన్న కోట్లాది కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

ప్రభుత్వం ఈ నిర్ణయానికి కారణంగా ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక ఎల్‌పీజీ వినియోగం నాలుగు సిలిండర్లే ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల సబ్సిడీని అదే స్థాయికి పరిమితం చేసినట్లు వెల్లడించింది. అయితే నాలుగు సిలిండర్లకు మించి వినియోగించే కుటుంబాలు మిగిలిన రీఫిల్లులకు పూర్తి మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, వినియోగదారుల సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ గ్యాస్ వినియోగించే లబ్ధిదారులపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *